LATEST NEWS

“కేంద్రీయ విద్యాలయం పై రాజకీయ చర్చలు… జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి

By SUNCHU SURESH • 2026-05-17 10:33 • 3 views   Share WhatsApp Share Facebook Share X
“కేంద్రీయ విద్యాలయం పై రాజకీయ చర్చలు… జగిత్యాల విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి

జగిత్యాల, మే 17:
జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంపై భూమి కేటాయింపు అంశం చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కనీసం ఐదు ఎకరాల భూమి అవసరం ఉండగా, జగిత్యాల జిల్లాలో సుమారు రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు సమాచారం.

ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన మేరకు ఐదు నుంచి పది ఎకరాల భూమి కేటాయించాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లాలో అందుబాటులో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ఈ అంశంపై ఎంపీ మరియు ఎమ్మెల్యే మధ్య అభిప్రాయ భేదాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ప్రక్రియపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్ర నిబంధనలకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులతో విద్యాలయం త్వరగా ఏర్పాటు కావాలని కోరుతున్నారు.

ప్రజల అభిప్రాయం ప్రకారం, విద్యా సంస్థ ఏర్పాటు విషయంలో రాజకీయ చర్చల కంటే అభివృద్ధి మరియు విద్యార్థుల ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.